మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తాను చేయబోయే మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో తన తదుపరి సినిమాల విషయం పై ఆలోచిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సైరా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాబోతున్న ఆచార్య సినిమా పై భారీ అంచనాలు నెలకొనగా రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో తండ్రితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పై అందరికీ ఎంతో ఆసక్తి కలుగుతుంది.

ఇకపోతే మోహన్ రాజా దర్శకత్వంలోనీ లుసిఫర్ సినిమా ను సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా సన్నాహాలు జరుగుతుండగా మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే వేదాలం సినిమా ఆ తర్వాత నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట చిరంజీవి. అలా ఒకేసారి రెండు సినిమాలను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ వెంటనే బాబీ సినిమా కు షిఫ్ట్ అయిపోవాలి అనేది మెగాస్టార్ ఆలోచన. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇప్పటికే స్క్రిప్టు విషయంలో వందకు వందశాతం మెగాస్టార్ ను సంతృప్తి పరిచారు ఈ ఇద్దరు దర్శకులు. ఈనేపథ్యంలో సినిమా ఎలా చేస్తారో చూడాలి. 

ఇకపోతే మెగాస్టార్ నటిస్తున్న వేదాలం రీమేక్ సినిమాలో కీర్తి సురేష్ ఆయన చెల్లెలి పాత్రలో నటిస్తున్నారని ఇటీవలే కీర్తి సురేష్ దానికి ఓకే చెప్పేశారు అని కూడా వార్తలు వచ్చాయి. ఈ పాత్రను చేయడానికి కీర్తి సురేష్ భారీగానే డబ్బులు డిమాండ్ చేసిందట. ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించారట. ఓ వైపు హీరోయిన్ గా ఇంకో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగడం కీర్తి సురేష్ కే చెల్లింది. ఆమె ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: