యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరొక నటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న భారీ సినిమా రౌద్రం రణం రుధిరం. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీం గా అలానే చరణ్ అల్లూరి సీతారామరాజు గా యాక్ట్ చేస్తుండగా కీరవాణి సంగీతాన్ని అలానే సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని అందిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాత డివివి దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నారు.

దీని తరువాత కొరటాల శివ తో తన తదుపరి సినిమా చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. మొదటగా స్టార్ మా ఛానల్ లో మూడేళ్ళ క్రితం ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా వ్యవహరించి ఆ షో ని ఎంతో పెద్ద సక్సెస్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న తాజా షో, ఎవరు మీలో కోటీశ్వరుడు. జెమినీ టీవీ లో ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న ఈ తాజా షోకి సంబంధించి ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసిన నిర్వాహకులు, కొద్దిసేపటి క్రితం ఫస్ట్ డే షోకి రానున్న తొలి సర్ప్రైజ్ పార్టిసిపెంట్ గురించి వివరాలు వెల్లడించింది.

అయితే ఆ రాబోయేది మరెవరో కాదు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కావడం విశేషం. 22న రాత్రి 8గం. 30 ని. లకు ప్రసారం కానున్న తొలిరోజు కర్టెన్ రైజర్ కి రామ్ చరణ్ విచ్చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం చరణ్, ఎన్టీఆర్ ల ప్రోమో వీడియో ని రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రామరాజు, భీం ఇద్దరూ కూడా తమదైన డైలాగ్, యాక్టింగ్ టాలెంట్ తో ఆకట్టుకోగా, టోటల్ గా ఈ షో ని వీరిద్దరూ అద్భుతంగా రక్తికట్టించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైక్స్ తో దూసుకెళుతోంది ....!!


మరింత సమాచారం తెలుసుకోండి: