దీని తరువాత కొరటాల శివ తో తన తదుపరి సినిమా చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. మొదటగా స్టార్ మా ఛానల్ లో మూడేళ్ళ క్రితం ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా వ్యవహరించి ఆ షో ని ఎంతో పెద్ద సక్సెస్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న తాజా షో, ఎవరు మీలో కోటీశ్వరుడు. జెమినీ టీవీ లో ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న ఈ తాజా షోకి సంబంధించి ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసిన నిర్వాహకులు, కొద్దిసేపటి క్రితం ఫస్ట్ డే షోకి రానున్న తొలి సర్ప్రైజ్ పార్టిసిపెంట్ గురించి వివరాలు వెల్లడించింది.
అయితే ఆ రాబోయేది మరెవరో కాదు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కావడం విశేషం. 22న రాత్రి 8గం. 30 ని. లకు ప్రసారం కానున్న తొలిరోజు కర్టెన్ రైజర్ కి రామ్ చరణ్ విచ్చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం చరణ్, ఎన్టీఆర్ ల ప్రోమో వీడియో ని రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రామరాజు, భీం ఇద్దరూ కూడా తమదైన డైలాగ్, యాక్టింగ్ టాలెంట్ తో ఆకట్టుకోగా, టోటల్ గా ఈ షో ని వీరిద్దరూ అద్భుతంగా రక్తికట్టించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైక్స్ తో దూసుకెళుతోంది ....!!