టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో తెలుగువారిని ఆకట్టుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈమెకు రెండో సినిమా అవకాశం రావడానికి ఎన్నో రోజులు పట్టలేదు.

ఈమె అందానికి ముగ్ధుడైన టాప్ హీరోలు తమ సినిమాల్లో రకుల్ పెట్టుకునేందుకు పోటీపడ్డారు ఆ విధంగా టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గత కొన్ని రోజులుగా ఈ మై కెరియర్ చూసుకుంటే వరుస సినిమాలు ఫ్లాప్ ల తో రకుల్ ప్రీత్ సింగ్ ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే వెనుకబడి పోయిందని చెప్పవచ్చు. ఆమె చేసిన సినిమాలు పరిస్థితిని ఎదుర్కొంది దానికి తోడు కొత్త హీరోయిన్లు వచ్చి దూకుడు చూపిస్తుండడం తో రకుల్ ను పట్టించుకోవడం మానేశారు. 

తెలుగు చిత్రం ఇదే కాకుండా ఆమె తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాలలో కూడా నటించింది హిందీలో మోస్తారు హీరోయిన్గ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది రకుల్. తెలుగులో ఆమె తిరిగి తన ఫామ్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా కొండపొలం అనే సినిమాలో నటిస్తుంది. పల్లెటూరి పిల్ల పాత్రలో విభిన్నమైన సినిమాలో చేస్తున్న రకుల్ ప్రీత్ ఈ సినిమాతో మళ్లీ పూర్వవైభవం తెచ్చుకోవడం గ్యారెంటీ అంటుంది. ఓబులమ్మ గా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలో కనిపిస్తుండగా ఈమె లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ఎంతో నాచురల్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో కనిపిస్తుండగా తప్పకుండా ఇది ఉపయోగపడే సినిమాగా నిలుస్తుందని అంటున్నారు ఆమె అభిమానులు. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: