స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తీసిన స్టైలిష్ ఎంటర్టైనర్ అలవైకుంఠపురములో మూవీ గత ఏడాది సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ కొట్టింది. గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా ఇతర పాత్రల్లో సుశాంత్, టబు, జయరాం , సచిన్ ఖేడేకర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, మురళి శర్మ నటించారు. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా  తీశారు త్రివిక్రమ్.

థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఎంతో గొప్ప క్రేజ్ దక్కించుకుని ముఖ్యంగా యువతని మరింతగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సాంగ్స్ యూట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూస్ అందుకోవడం, అనంతరం అల్లు అర్జున్ కి హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జరిగింది. ఇక ఈ సినిమాలో బంటుగా అల్లు అర్జున్, మేడం పాత్రలో పూజా హెగ్డే తమ అద్భుత నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. మ్యాటర్ ఏమిటంటే, కొన్ని నెలల క్రితం ఫస్ట్ టైం జెమినీ టివిలో ప్రసారమైన ఈ సినిమా 29.4 టిఆర్పి రేటింగ్ ని దక్కించుకుని టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ అందుకున్న మూవీగా గొప్ప రికార్డు నెలకొల్పింది.

ఆ తరువాత రెండవసారి 7. 91, మూడవ సారి 6.72, నాలుగవ సారి 7.92 రేటింగ్ అందుకున్న ఈ సినిమా ఇటీవల ఐదోసారి ప్రసారమై ఏకంగా 11.3 రేటింగ్ దక్కించుకుని రికార్డు గా నిలిచింది. గతంలో వచ్చిన రేటింగ్ కంటే కూడా ఐదవసారి ఈ స్థాయి రేటింగ్ రావడం అంటే తమ సినిమాపై ప్రేక్షకుల అమితాభిమానానికి కారణం అంటున్నాయి అలవైకుంఠపురములో యూనిట్ వర్గాలు. అలానే వారు ప్రత్యేకంగా ప్రేక్షకాభిమానులు అందరికీ ధన్యవాధాలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: