సురేష్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం 'డాడీ'.అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. 2001 అక్టోబర్ 4 వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సినిమా.ఇక ఈ సినిమా కంటే ముందు డైరెక్టర్ సురేష్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన 'మాస్టర్' సినిమా పెద్ద హిట్ అవ్వడంతో 'డాడీ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.కానీ ఆ అంచనాలను 'డాడీ' చిత్రం పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది.అప్పటికి చిరంజీవి కూడా వరుస ప్లాపుల్లో ఉండటంతో..ఆ ఎఫెక్ట్ కాస్త డాడీ సినిమాపై పడిందనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటె.. అసలు ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదట.ముందు ఈ కథను వేరే హీరో రిజెక్ట్ చేయడంతో ఆ కథ మెగాస్టార్ వద్దకు వెళ్లిందట.ఆ హీరో మరెవరో కాదు.మన యాంగ్రీ మెన్ రాజశేఖర్.ఈయన్ని దృష్టిలో పెట్టుకొనే 'డాడీ' కథను రెడీ చేసుకున్నాడట దర్శకుడు సురేష్ కృష్ణ.ఈ కథ వినిపించడానికి రాజశేఖర్ కి ఫోన్ చేయగా..అప్పటికి రాజశేఖర్ వేరే సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల వెయిట్ చేయాల్సి వచ్చిందట.అయితే 'గీతా ఆర్ట్స్'వారి నిర్మాణంలోనే ఈ సినిమా సురేష్ కృష్ణ భావించారు.అయితే కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవితో చేస్తే బాగుంటుందని నిర్మాత అల్లు అరవింద్..దర్శకుడు సురేష్ కృష్ణ కి సూచించారుట.

అయితే చిరంజీవి ఈ కథను ఒప్పుకుంటారని అసలు ఊహించలేదట సురేష్ కృష్ణ. అయినప్పటికీ ఈ కథకి చిరు ఓకే చెప్పారట.ఇక ఈ సినిమాలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ ఫైట్ ని కంపోజ్ చేయడం విశేషం అని చెప్పాలి.ఇక ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. తాజాగా ఆచార్య షూటింగ్ ని పూర్తి చేసిన చిరూ.. ఈ సినిమా అనంతరం గాడ్ ఫాదర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.మలయాళంలో వచ్చిన లూసిఫర్ అనే సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: