మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ అగ్ర కథానాయికగా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా ఎఫ్ త్రీ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోల సరసన ఫస్ట్ ప్రిఫరెన్స్ హీరోయిన్ గా మారిన తమన్నా మరో క్రేజీ ఆఫర్ ను కొట్టేసింది అంటూ అనేక రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంపిక అయినట్టు అనేక రోజులుగా వార్తలు బయటకు వస్తున్నాయి.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా బోలా శంకర్ సినిమా కోసం దాదాపుగా మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇందులో సగభాగం తమన్నా కు  చేరిపోయింది అంటే కూడా ఫిల్మీ దునియా లో ఓ టాక్ నడుస్తోంది. ఒక వేళ ఈ ప్యాకేజ్ కనుక నిజమే అయితే తమన్నా కెరీర్ బెస్ట్ ప్యాకేజీ అవుతుంది. చిరంజీవి సరసన ఎప్పటి నుండో నటించాలి అనుకున్న తమన్నా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా లో చిరంజీవి సరసన నటించి మెప్పించింది. తాజాగా బోలా శంకర్ సినిమాతో మరొకసారి చిరంజీవి తో నటించే అవకాశాన్ని మిల్కీ బ్యూటీ తమన్నా కొట్టేసింది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో  చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇది ఇలా ఉంటే బోలా శంకర్ సినిమా ఈ నెల 11 న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, 15 వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: