తన క్యూట్ అందంతో ‘ఝుమ్మంది నాదం’  సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరపింప చేసింది. ఇదే ఆమె మొదటి సినిమా అయినప్పటికీ తన గ్లామర్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది తాప్సి పన్ను. తెలుగు లో అనేక హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ తెచ్చిన మంచి పేరుతో బాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటీ. అప్పటి నుండి మంచి కథల సెలక్షన్ తో గొప్ప విజయాలను తనఖాతాలో వేసుకుంటూ వుంది ఈ వయ్యారి .  ప్రస్తుతం  బాలీవుడ్ లో అగ్ర కథానాయకి లలో ఒకరుగా ఉన్నారు తాప్సి. 



అటు సినిమాలలోనే కాకుండా వెబ్ సిరిస్ లలో నటిస్తూ తన స్టామినా ను నిరూపించుకుంటూ వుంది నటి . అయితే ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలు నిర్మిస్తూవుంది. ఆమె తాజాగా నటించిన రష్మీ రాకెట్   సినిమాకు  ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం భారీ వసూళ్లను సొంతం చేసుకుంది కూడా. ఈ సందర్భంగా తాప్సి పలు చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట్వ్యూ లలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. స్టార్ హీరోలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ లకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో పేరొందిన హీరోలు చేయడానికి ఒప్పుకోరని చెప్పింది.




ఆలా నటించవలసి వస్తే వారు చాల సంకుచితంగా భావిస్తారని . వారికీ ఉన్న క్రేజ్ దృష్ట్యా వారు అలాంటి సినిమాలు చేయడానికి ఒప్పుకోరని తెలిపింది.  తాప్సి డబుల్ రోల్ చేస్తున్న సినిమా కోసం ఆమె ప్రొడ్యూసర్ ఒక స్టార్ హీరో ని కలిసి ఆమె సినిమాలో నటించమని చెప్పినప్పుడు ఆ హీరో సంకోచించాడట. అయితే నతకుముందు  ఆ హీరో తాప్సి తో నటించాడు అందులోను బాలీవుడ్ లో అతను ఒక టాప్ హీరో. అతనిపై అసహనం తోనే ఈ  వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆ హీరో ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు. అసలువిషయం బయటకు తీయడానికి పలుమార్లు ప్రయత్నించినా కూడా ఆమె ఆ  పెద్ద హీరో పేరు చెప్పడానికి ఒప్పుకోలేదు


మరింత సమాచారం తెలుసుకోండి: