
ఈ అమ్మడు ఒక్కసారి తెర మీద కనిపించింది అంటే చాలు యూత్ అందరూ కూడా ఉర్రూతలూగి పోతూ ఉంటారు. అయితేకోలీవుడ్ సినిమా ప్రేమమ్ లో మొదట సినీ రంగ ప్రవేశం చేసింది అనుపమ పరమేశ్వర్. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఆ అనే సినిమాతో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత శతమానం భవతి అనే ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఈ అమ్మడు అందం అభినయం అందర్నీ ఆకట్టుకుంది.. ఈ క్రమంలోనే ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించలేకపోయింది. ఈ అమ్మడు నటించిన రాక్షసుడు సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ సినిమా ఈ హీరోయిన్ కు గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది. టాలెంట్ వున్న ప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో అవకాశాలు అందుకోలేకపోయింది అనుపమ పరమేశ్వరన్.