ఈ సంవత్సరం రవితేజ మరియు బాలకృష్ణ లకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే వారి కళ్ళల్లో ఎన్నడూలేని విధంగా వారు నటించిన రెండు సినిమాలు ఈ సంవత్సరం విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి మాస్ రాజా రవితేజ హీరోగా చేసిన ఈ చిత్రం ఈ ఏడాది మొదట్లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఆయన కెరీర్లోనే ఎప్పుడూ లేని విధంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లు కూడా సాధించగా ఈ చిత్రానికి దర్శకుడు గోపిచంద్ మలినేని తో రవితేజ మూడవ సినిమా చేసి వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.

అలాగే బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీను తో కలసి మూడవ సినిమా చేసి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. అఖండ చిత్రం వీరి కాంబినేషన్లో మూడో సినిమా కాగా ముందు నుంచి ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో వీరి లాగానే మరో హిట్ కొట్టాలని గోపీచంద్ మలినేని భావించి ఆయన రెండు సినిమాలు చేసిన దర్శకుడితో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నాడు. లక్ష్యం సినిమాతో శ్రీవాస్ గోపీచంద్ తొలిసారి సినిమా చేయగా అది మా ఇద్దరికీ మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత కలసి లౌక్యం అనే సినిమా చేయాలి అది కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది.

ఈ నేపథ్యంలోనే వీరి కాంబినేషన్లో మరో సినిమా చూడాలని ప్రేక్షకులు ఎంతగానో డిమాండ్ చేయగా దానికి ఇప్పుడు సందర్భం వచ్చింది వీరి కాంబినేషన్లో చిత్రం ఇప్పుడు తెరకెక్కుతోంది ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయడానికి వివి వినాయక్ ముఖ్య అతిథిగా వచ్చాడు ఏదేమైనా హాట్రిక్ సినిమాలు చేసిన వారు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న నేపథ్యంలో వీరిద్దరూ చేస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: