మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా సక్సెస్ తర్వాత ఖిలాడి సినిమా భారీ అంచనాలతో ఫిబ్రవరి 11న విడుదలైంది.అయితే రవితేజ నటించిన ఈ సినిమాకు ఊహించిన టాక్ రాలేదు.ఇక రమేశ్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా... విడుదలైన మొదటి రెండు రోజుల్లో  7 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. రవితేజ నటించిన ఈ సినిమా మరో 15 కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ  ఈయన సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. ఇక ఇదిలా ఉంటె సోషల్  మీడియాలో ప్రచారం ప్రకారం  ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని  అంటున్నారు.అయితే ఖిలాడి సినిమాకు సీక్వెల్ వస్తుందనే ప్రచారంలో నిజం ఉందని అనిపించకపోదు. 

ఇక ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంది అన్నట్టుగానే ముగించాడు . అయితే మాస్ మహారాజా రవితేజ కిలాడి సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా కథ కూడా పూర్తి కాలేదు. అయితే ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఇక సినిమా కథ ఏంటంటే 10 వేల కోట్లు కొట్టడానికి తన టీంతో కలిసి రవితేజ ఏం చేశాడు.. చివరికి ఆ డబ్బును ఎలా సొంతం చేసుకున్నాడు అనేదే. అంతేకాకుండా అక్కడక్కడా తమిళ సినిమాలు సతురంగ వెట్టై, మంగత్త ఛాయలు ఇందులో కనిపిస్తుంటాయి.  

అయితే విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో సినిమా అంచనాలు అందుకోలేకపోయిందని. ఇదిలా ఉంటే ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్ కు మాత్రం తెగ నచ్చేసింది. ఇక తాజాగా అందుతున్న దాని ప్రకారం సినిమా దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకి సిగ్నల్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఈ సీక్వెల్ కోసం రవితేజ ఒప్పుకుంటాడా లేదా అన్న విషయం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించడం జరిగింది. అంతేకాకుండా  జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక కీలక పాత్రలో అందరిని ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: