యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులు వస్తున్నా కూడా ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఆయన చేసిన గత రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో చాలా దూరంలో ఉండిపోయాయి. అలాగే ఈ మూడు సినిమాలు కూడా విజయం అందుకోలేక పోయాయి దాంతో ఆయన అభిమానులు ఎంతగానో నిరాశపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రేక్షకులను అలరించాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో జరిగే రాజకీయాల చుట్టూ తిరగడం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా తరహాలోనే ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు అయితే ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండగా నితిన్ మరొక ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. దీనికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించనునట్లు తెలుస్తోంది.

రచయితగా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు ఆయన కథలను అందించాడు. అయితే దర్శకుడిగా తొలి ప్రయత్నం చేసిన నా పేరు సూర్య సినిమా తో ఆయనకు అనుకున్నంత సక్సెస్ రాలేదనే చెప్పాలి. పెద్ద హీరోతో సినిమా చేసినా కూడా ఎందుకో అది కలిసిరాలేదు. కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు తన రెండవ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు జూనియర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ఉండబోతుందని అంటున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తుండగా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దర్శకుడిగా ఇది రెండో సినిమా అయినా నేపథ్యంలో వక్కంతం వంశీసినిమా ను తప్పకుండా మంచి హిట్ సాధించేలా చేయాలి.. దర్శక రచయిత గా కొనసాగాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. మరి ఈ హీరో దర్శకుడు ఈ ఇద్దరికీ హిట్ అవసరమైన నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: