కొన్ని కొన్ని సార్లు ఓ సినిమా పరిశ్రమలో హీరో నిలబడాలి అంటే తప్పకుండా సదరు సినిమా పరిశ్రమలోని సినిమాలే కాదు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉపయోగపడతాయి. అలా వారు చేసిన రీమేక్ సినిమాలు వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతాయి. ఆ విధంగా బాలీవుడ్లో ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న కొంతమంది హీరోలు టాలీవుడ్ సినిమాల ద్వారానే హిట్ కొట్టి భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.

ఆయనకు కబీర్ సింగ్ తో వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అంతకుముందు ఆయన తన సినిమాల తో ఇంత ఇమేజ్ సంపాదించుకోలేక పోయాడు. పారితోషకం తీసుకోవడం కూడా అంతత మాత్రమే. అలా అర్జున్ రెడ్డి సినిమా ను కబీర్ సింగ గా చేసి హిట్ కొట్టడమే కాదు పెద్ద హీరోల జాబితాలో కూడా చేరిపోయాడు. బాలీవుడ్ లో ఆయనకు భారీ స్థాయిలో క్రేజ్ పెరిగింది అంటే ఈ టాలీవుడ్ సినిమా పుణ్యమే.  ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న జెర్సీ సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 150కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న గా కరోనా వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా ఎట్టకేలకు త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులో నాని హీరోగా నటించిన ఈ సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం షాహిద్ ఏకంగా 35 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ కూడా తెలుగులో చేసిన కొన్ని సినిమాలను రీమేక్ చేసి ఇప్పుడు భారీ స్టార్డమ్ ను అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత చాలా మంది బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలు చేశారు. రణవీర్ కపూర్ టెంపర్ సినిమా ను అక్కడ రీమిక్స్ చేయగా ఆయన స్టార్ హీరోగా ఎదగడానికి ఇది ఎంతో ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత చాలామంది హీరోలు తెలుగు సినిమాలతో హిట్లు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలలో తెలుగు సినిమా ప్రత్యేకత చాలా ఉందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: