బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ తో పవర్ స్టార్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇక తాజాగా భీమ్లానాయక్ గా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చిన పవన్… ఇప్పుడు  టార్గెట్ హరిహర వీరమల్లు అంటున్నారు.ఇక ఈ సినిమా తరువాత తర్వాత హరీష్ శంకర్ సినిమాని లైన్ లో పెట్టారు. అయితే ఈలోపే మరో రెండు ప్రాజెక్ట్ లను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇకపోతే ఆ రెండు కూడా రీమేక్సే కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.అయితే 2022లో ఫస్ట్ మెగా హిట్ గా నిలిచింది భీమ్లానాయక్. ఇకపోతే వన్ మ్యాన్ ఆర్మీగా పవన్ భీమ్లానాయక్ ను వంద కోట్ల క్లబ్ లో చాలా ఈజీగా చేర్చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడిక ఫోకస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టారు. అయితే క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది పవన్ ఫస్ట్ ప్రియారిటీ.

ఇక ఆపై లైన్ లో హరీశ్ శంకర్ భవదీయుడు…అయితే  భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఉన్నా… పవర్ స్టార్ మాత్రం మరో రెండు రీమేక్స్ పై కాన్సంట్రేట్ చేస్తున్నారు.ఇక తాజాగా మలయాళీ హిట్ అయప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా వచ్చి బంపర్ హిట్ అనిపించుకుంది భీమ్లానాయక్. అయితే ఈ సక్సెస్ లో డైరెక్టర్ సాగర్ చంద్రతో పాటూ మేజర్ పార్ట్ త్రివిక్రమ్ దే. ఇక అందుకే పవన్ కు మరో హిట్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ వినోదయ సిత్తం రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే మల్టీస్టారర్ గా తెరకెక్కబోయే ఈ మూవీలో పవన్ తో పాటూ సాయిధరమ్ తేజ్ లేదంటే వైష్ణవ్ తేజ్ నటించే అవకాశముంది. అయితే ఈ సినిమా కూడా భీమ్లానాయక్ బ్యానర్ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ లోనే ఉండబోతుంది.

అంతేకాకుండా పవర్ స్టార్ లిస్ట్ లో మరో రీమేక్ విక్రమ్ వేదా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోయే ఈ మూవీలో పవన్ కల్యాణ్ తో పాటూ మాస్ రాజా రవితేజను సెట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది .అయితే  రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే తమిళ్ మాసివ్ హిట్ విక్రమ్ వేదాను హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కాంబోలో రీమేక్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో పవన్, రవితేజ కాంబినేషన్ అంటే సెన్సేషన్ అవడం ఖాయం. ఇకపోతే బాబీ మూవీ కోసం ఆల్రెడీ అన్నయ్య చిరూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా…అయితే  ఇప్పుడిక తమ్ముడు పవన్ తో కలిస్తే అరుపులే అంటున్నారు ఫ్యాన్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: