ప్రభాస్ తో తొలిసారిగా జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ తీసిన భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఒకప్పటి బాలీవుడ్ నటి భాగశ్రీ ఇందులో ప్రభాస్ తల్లిగా కనిపించారు. మురళీశర్మ, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరాం, సచిన్ ఖేడేకర్ వంటి నటులు కీలక పాత్రలు చేసిన రాధేశ్యామ్ కి మనోజ్ పరమహంస కెమెరా మ్యాన్ గా వ్యవహరించారు.

ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన రాధేశ్యామ్ ఇటీవల సాంగ్, ట్రైలర్, టీజర్ తో అందరిలో మరిన్ని అంచనాలు పెంచింది. ఇక ఫైనల్ గా ఎప్పటి నుండో అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ మూవీ నేడు భారీ స్థాయిలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రాధేశ్యామ్ నిన్న అర్ధరాత్రి విదేశాల్లో వేసిన ప్రీమియర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మూవీలో ప్రభాస్ పూజా హెగ్డే ల జోడీ ఎంతో బాగుందని, మిగతా పాత్రధారులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారని, థమన్ బీజీఎమ్, జస్టిన్ సాంగ్స్ మూవీ కి మంచి ప్లస్ అయ్యాయని చెప్తున్నారు.

ఇక దర్శకుడు రాధాకృష్ణ సినిమా కథనం నడిపించే విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, అక్కడక్కడా సినిమా కొంత బోర్ కొడుతుందని, సినిమా చాలావరకు సాగతీతగా నడిపించినా క్లైమాక్స్ సీన్స్ మాత్రం బాగున్నట్లు చెప్తున్నారు. కాగా రాధేశ్యామ్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తమ మనసులో నిలిచిపోతుందని, ఫైనల్ గా చెప్పాలి అంటే ఈ సినిమాకి గ్రాండియర్ విజువల్స్, భారీ నిర్మాణ విలువలు పెద్ద ప్లస్ అయ్యాయని కొందరు ఆడియన్స్ అంటున్నారు. మరి ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్ మూవీ నేడు పూర్తిగా ఎంతమేర టాక్ ని సొంతం చేసుకుని, ఇకపై ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: