ప్రశాంత్ నీల్,హీరో యష్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం  కేజీఎఫ్..ఈ సినిమాకు మాస్ ప్రెక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో ఇప్పుడు సీక్వెల్ సినిమా కూడా వచ్చింది. కేజీఎఫ్ 2 సినిమా ఊహించిన దానికంటే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ సంచలనాలు సృష్టిస్తుంది.. పది రోజుల తర్వాత కలెక్షన్స్ అనుకొని రీతిలో వసూల్ చేసింది. ఈ సినిమాకు బాలివుడ్ లో మరి ఎక్కువగా కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తె బాలివుడ్ జనాలకు మతి పోతుందని చెప్పాలి. హిందిలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.


బాలీవుడ్‌లో 300 కోట్ల నెట్ దాటిన సినిమాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. బాహుబలి రూ.510 కోట్ల తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. దంగల్ 317 కోట్లు.. టైగర్ జిందా హై 301 కోట్లు వసూలు చేశాయి.1000 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. ఇదే జరిగితే సౌత్ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి తర్వాత ఆ అరుదైన రికార్డు అందుకున్న దర్శకుడిగా ప్రశాంత్ సంచలనం సృష్టిస్తాడు. అంత క్రేజ్ లేని కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాకు ఇంత క్రేజ్ రావడం గమనార్హం..


మరో వారంలో ఈ సినిమా 1000 కోట్లు అందుకోవడం ఖాయమని అందరు అంటున్నారు.. తెలుగు ఇండస్ట్రీలో రూ. 78 కోట్ల బిజినెస్ చేసినప్పుడు ఒక డబ్బింగ్ సినిమా కు ఈ స్థాయి వసూళ్లు వస్తాయా అనుకున్నారు.. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే 71 కోట్ల షేర్ వసూలు చేసి అందరి అంచనాలను తలకిందులు చేసింది. కెజీఎఫ్ సినిమా వల్ల బాలివుడ్ లో వచ్చిన సినిమాలు ఏవి జనాలకు కనిపించ లేదని కొందరు ప్రముఖులు అంటున్నారు. జక్కన్న తర్వాత అంతటితో రికార్డును ప్రశాంత్ అందుకోవడం ఖాయం.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా 1000 కోట్లు క్లబ్ లోకి చెరిందని చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: