ఇందులో సత్యదేవ్ హీరోగా నటించగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేసింది... ఇక సత్యదేవ్ తో గతంలో బ్లఫ్ మాస్టర్ లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమా తీసిన గోపి గణేష్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ సినిమా కూడా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే మూవీ అని ప్రమోషన్స్ లో చెప్పడం జరిగింది. ఇందులో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొట్టగానే ఉంది.. అంటే ఇంతకు ముందు ఎందరో ఈ పాయింట్ ను డీల్ చేసి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే సినిమాగా గాడ్సే ను రూపొందించాడు. సినిమా మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉందని ఇప్పటికే వచ్చిన రివ్యూ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా ప్రతి ఒక్క రాజకీయనాయకుడికి ఒక చురకలా ఉంటుందని చెబుతున్నారు.
సినిమా గురించి యావరేజ్ టాక్ వినిపిస్తున్నా, గాడ్సే పాత్రలో సత్యదేవ్ అన్నీ తానై నడిపించాడట. శంకర్ తెరకెక్కించిన జంటిల్మన్, భారతీయుడు లాంటి సినిమాలు గుర్తుకు వచ్చేలా ఈ సినిమాను గోపి గణేష్ తెరకెక్కించాడట. మరి ఈ సినిమా ఎంతమేరకు నేటి ప్రజలను ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.