సినీ ఇండస్ట్రీ సూపర్ లేడి నయన తార ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా కాకున్నా ప్రముఖుల సన్నిధిలో ఆమె తన ప్రియుడు, తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్ ను వివాహాం చేసుకుంది.


అంతకుముందు హీరో శింబు, ప్రభుదేవాను పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా డైరెక్టర్ విగ్నేశ్ తో ఎంతోకాలంగా సహజీవనం చేస్తున్నానని నయనతార ప్రకటించడం సంచలనంగా మారిందట.అయితే ఇటీవల నయర్ కపుల్స్ హనీమూన్ కోసం బ్యాంకాక్ వెళ్లిందట.అక్కడ అందమైన ప్రదేశాల్లో ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తోంది. వారు ఎంజాయ్ చేస్తున్న ప్రైవేట్ పిక్స్ ను డైరెక్టర్ విగ్నేశ్ తన ఖాతా నుంచి సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ పై హాట్ టాపిక్ నడుస్తోంది.



కేరళకు చెందిన నయనతార.. తెలుగు, తమిళం మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగులోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేసింది. ఇక్కడున్న అగ్ర హీరోలందరితో కూడా కలిసి నటించింది. ఈ మధ్య కాలంలో కనిపించిన సినిమాల్లో యంగ్ బ్యూటీగా కాకుండా సీనియర్ హీరోయిన్ పాత్రలోనే కనిపించింది. ఇక కొన్ని రోజులుగా ఆమె ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు హీరో శింబుతో ప్రేమాయణం సాగిస్తుందని కొన్ని పిక్స్ వచ్చాయి. ఆ తరువాత ప్రముఖ డ్యాన్సర్ ప్రభుదేవాను పెళ్లాడనుందని అనుకున్నారట.. ప్రభుదేవా కోసం నయన్ మతం కూడా మార్చుకుందట. అటు ప్రభుదేవా భారీ భరణంతో తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చారట..


అయితే అనూహ్యంగా ఆమె డైరెక్టర్ విగ్నేశ్ తో కలిసి ఉన్న పిక్స్ బయటికొచ్చాయి. ఓ సినిమా చేస్తున్న సందర్భంగా వీరు ప్రేమలో పడ్డారట. ఆ తరువాత కలిసి షికార్లు కూడా చేశారు. సోషల్ మీడియాలో వీరి గురించి రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరికి నయన్ తమ లవ్ స్టోరీ గురించి డిక్లేర్ చేసేంది. దీంతో వీరిద్దరు ఈనెల 9న ఒక్కటయ్యారు. అయితే నయన్, విగ్నేష్ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేకున్నా వీరు కర్ణాటకలోని మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారట.అతిరథమహుల మధ్య వీరి వివాహం జరిగిందనీ సమాచారం..




పెళ్లయిన వెంటనే తిరుపతికి వచ్చిన ఈ జంట వివాదంలో పడింది. పాదరక్షలు ధరించి మాడ వీధుల్లో నడవడం ప్రజలకు బాగా ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో టీడీడీ అధికారులు మందలించగా క్షమాపణ చెప్పింది. అయితే ఆ తరువాత ఈ జంట వెంటనే హానీమూన్ కోసం బ్యాంకాక్ వెళ్లిందట.. అక్కడ అందమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. వీరికి సంబంధించిన పిక్స్ డైరెక్టర్ నయన్ విగ్నేశ్ ద్వారా బయటికి వచ్చాయి.


ఈ ఫొటోల్లో నయన్ ఎల్లోకలర్ ఫ్రాక్ వేసుకొని ఓ పడవలో కూర్చొని ఉందట.. విగ్నేశ్ మాత్రం సింపుల్ గానే ఉన్నారు. మరో ఫొటోలో నయన్ ను విగ్నేశ్ ముద్దాడుతున్నారు.. ప్రస్తుతం పిక్స్ బాగా వైరల్ గా మారాయి. అయితే కొన్ని రోజులపాటు ఇక్కడే ఎంజాయ్ చేసిన తరువాత ఈ జంట తిరిగి తమిళనాడుకు రానున్నారు. ఆ తరువాత ఎవరి సినిమాల్లో వారు బిజీ బిజీగా మారనున్నారు. అయితే పెళ్లయిన తరువాత గ్లామర్ పాత్రలు చేయనని నయన్ ఇప్పటికే చెప్పిందట.. మరి ఈ భామ ఎలాంటి సినిమాల్లో అలరిస్తుందో చూడాలో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: