మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం 28 వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతుంది. గత కొన్ని రోజులుగా విడుదల అవుతున్న సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడం ఆ సినిమాలకు భారీ స్థాయిలో నష్టాలను చేకూర్చుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా అయినా ప్రేక్షకులను అలరించి అందరిని థియేటర్లకు రప్పిస్తుందా అన్న ఆలోచన చేస్తున్నారు మేకర్స్. గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏ సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోతున్నాయి. అలాంటి ఈ సమయంలో తప్పకుండా మాస్ రాజా ఇప్పుడు ప్రేక్షకులందరికీ అలరించవలసిన అవసరం ఎంతైనా ఏర్పడింది అని చెప్పవచ్చు.

ఆయన గత సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించక పోవడంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవలసిన అవసరం ఏర్పడింది. ఎక్కువ రోజులు సక్సెస్ లేకపోతే హీరోల కెరీర్ ప్రమాదంలో పడుతుంది.  శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి వెలబడిన అప్డేట్ లు మంచి అంచనాలను ఏర్పరిచాయి. తప్పకుండా మాస్ ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మాస్ లో రవితేజకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో ఇప్పుడు చేస్తున్న సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నారు. కంటెంట్ పరంగా కూడా ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అంగరంగ వైభవంగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే జరగబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి లో హిట్ అవుతుందో చూడాలి. పలు తమిళ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు శరత్ మండవ ఇప్పుడు ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: