టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనలో వేరియేషన్స్ చూపిస్తు ప్రేక్షకుల మదిలో నిలిచి పోతున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ .అయితే  వరుణ్ మొదటి నుండి కూడా డేరింగ్ స్టెప్పులు వేస్తూ ఆడియెన్స్ ను తన నటనతో అలరిస్తున్నాడు..ఇక మిగతా మెగా హీరోల కంటే కూడా తెలివిగా డిఫెరెంట్ జానర్ సినిమాలు చేస్తూ ఈయనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకోవడంలో సఫలం అయ్యాడు.ఇదిలావుంటే ఇటీవలే వరుణ్ తేజ్ గని సినిమాతో వచ్చాడు.ఇక  ఈ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కింది.కాగా  అల్లు బాబీ, సిద్ధూ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.

అయితే ఇక  ఈ సినిమా ఫెయిల్ అయినా వెంటనే ఎఫ్ 3 సినిమాతో వచ్చి వెంటనే సూపర్ హిట్ అందుకున్నాడు వరుణ్.ఇప్పుడు వరుణ్ తన 12వ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు..ఇక  ఇది కూడా డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కుతుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెగ్యురల్ షూట్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బైనార్ పై బివిఎస్ఎన్ నిర్మిస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.ఇకపోతే అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గిరీశయ్య కు వరుణ్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ప్రెజెంట్ ఈ డైరెక్టర్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో 'రంగరంగ వైభవంగా' సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బివిఎస్ఎన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమా తర్వాత సేమ్ బ్యానర్ లో గిరీశయ్య మరో సినిమాకు కమిట్ అయ్యారని.. అన్ని ఓకే అయితే వరుణ్ తేజ్ తోనే ఈ సినిమా ఉందనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: