సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  సెలబ్రిటీల మధ్య ఇగోలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఇక ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీలు అయినా చాలా తరచుగా ఇగోలకు పోతూ ఉంటారు. అయితే సినిమా రంగంలో హీరోలు, దర్శకులు - హీరోలు, హీరోయిన్లు - దర్శకులు, హీరోయిన్ల మధ్య కూడా ఇగోలు సర్వసాధారనం. ఇక సినిమా రంగంలో తెర ముందు కనపడేవి ఒకలా.. తెరవెనక జరిగేవి మరోలా ఉంటాయి. ఇకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కోపరేట్ చేసే హీరోయిన్లు అంటే బాగా ఇష్టం.కాగా  సమంత, పూజహెగ్డే కు త్రివిక్రమ్ వరుసగా సినిమాలు ఇవ్వటం వెనక టాలీవుడ్ లో చాలా గుసగుసలే వినిపిస్తూ ఉంటాయి. అయితే సమంతకు ఏకంగా అత్తారింటికి దారేది - సన్నాఫ్ సత్యమూర్తి - అ.. ఆ లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. 

పూజ హెగ్డే కు ఎన్టీఆర్ అరవింద సమేత - బన్నీ అలవైకుంటపురంలో సినిమాలతో రెండు సూపర్ హిట్లు ఇచ్చాడు. ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు మహేష్ బాబు సినిమాలోను పూజనే హీరోయిన్గా ఎంపిక చేశాడు.ఇకపోతే  అదే త్రివిక్రమ్ తనతో విభేదించిన నిత్యామీనన్‌ను మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడన్న గుసగుసలు ఉన్నాయి. ఇక ఇంకా చెప్పాలంటే నిత్యామీనన్ పై గురూజీ ఏకంగా పగ పట్టేసాడనే ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. అయితే బన్నీ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టుగా ఎక్స్పోజింగ్ చేయనని చెప్పడంతో పాటు కాస్త ఆశ్లేలంగా కనిపించేందుకు నిత్య ఒప్పుకోలేదని అంటారు.ఇక అందుకే ఆ సినిమాలో నిత్య పాత్రను బాగా తగ్గించడంతో పాటు.. ఆమె నటించిన కొన్ని మంచి సీన్లను కూడా త్రివిక్రమ్ ఎడిటింగ్లో డిలీట్ చేయించాడని టాక్.

త్రివిక్రమ్ అంతా తానే నడిపిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలోను పవన్ కు నిత్యామీననే హీరోయిన్గా చేయాల్సి వచ్చింది.ఇక  ఆ సినిమాలో కూడా గురూజీ నిత్యపై పగ పట్టి ఆమె నటించినా ఒక పాటని ఎడిటింగ్లో తీయించి వేశాడని టాక్. ఇక ఈ సినిమాలో అంత ఇష్టం ఏందయ్యా ? అనే పాట రిలీజ్ కి ముందు బాగా హైలెట్ అయింది.ఈ సినిమాలో కూడా ఈ పాట ఉంటే కచ్చితంగా నిత్యకు మంచి మార్కులు పడి ఉండేవి. గురూజీ దగ్గరుండి కావాలని మరి ఎడిటింగ్లో ఆ పాట తీయించి వేశాడని గుసగుసలు వినిపించాయి.ఇకపోతే  నిత్యామీనన్ అంటే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా నుంచే గురూజీకి పెద్దగా ఇష్టం ఉండదని.కాగా  ఆ కోపాన్ని మరోసారి భీమ్లా నాయక్ సినిమాలో పాట కట్ చేయడం ద్వారా తీర్చుకున్నాడని ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: