లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మా నగరం ,  ఖైదీ ,  మాస్టర్ వంటి విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ,  కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి విజయ్ సేతుపతిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

అలాగే ఈ మూవీలో మలయాళ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్నటు వంటి నటులలో ఒకరు అయిన ఫాహాద్ ఫజిల్మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. అలాగే ఈ మూవీ లో కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన విక్రమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అలాగే ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న విక్రమ్ మూవీ తాజాగా తెలుగు లో బుల్లితెర పై ప్రసారం అయ్యింది. ఈ మూవీ మొదటి సారి తెలుగు లో బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 5.1 'టి ఆర్ పి' రేటింగ్ ని సాధించింది. డబ్బింగ్ సినిమా అయ్యి కూడా తెలుగు లో ఈ రేంజ్ 'టి ఆర్ పి' ని సాధించడం అనేది గొప్ప విషయమే అని చెప్పవచ్చు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా బుల్లి తెరపై కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: