మోస్ట్ టాలెంటెడ్ ... మోస్ట్ బ్యూటిఫుల్ ...  మోస్ట్ గ్లామరస్ నటి మనులలో ఒకరు అయిన అనుష్క గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుష్క ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీలలో తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా , ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీలలో తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇలా అందచందాలతో , నటనతో ప్రేక్షకులను అలరించిన అనుష్క ప్రస్తుతం సినిమాల స్పీడ్ ని కాస్త తగ్గించింది.  

అనుష్క ప్రస్తుతం యు వి క్రియేషన్స్ బ్యానర్ లో తేరక్కెక్కుతున్న ఒక మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ , జాతి రత్నాలు మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా కథ విషయంలో మూవీ యూనిట్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అది ఎందుకు అనుకుంటున్నారా ...  అసలు విషయం లోకి వెళితే ... తాజాగా బెల్లంకొండ గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా స్వాతిముత్యం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల కూడా అయింది. స్వాతిముత్యం మూవీ కథ అంతా కూడా వీర్యదానం - సరోగసి అనే పాయింట్ చుట్టూ కామెడీని టచ్ చేస్తూ నడుస్తుంది. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో తేరకెక్కుతున్న సినిమా కథ కూడా ఈ లైన్ చుట్టే తిరుగుతుందట ,  దానితో ఈ మూవీ టీమ్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: