అలనాటి అందాల తారల లో సీనియర్ నటి తులసి ఒకరు మొదట బాలనటి గా అనేక సినిమాలలో నటించి మెప్పించిన తులసి ఆ తరువాత హీరోయిన్ వేషాల వైపు వెళ్లినప్పటి కీ, చివరికి కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిర పడ్డారు.మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా కూడా ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగానే ఉన్నారు. తెలుగు సినిమాల నుంచి అవకాశాలు ఎక్కువగా వెళుతుండటం వలన, ఆమె చెన్నై నుంచి హైదరాబాదు కి షిఫ్ట్ అయ్యారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మా అమ్మగారికి మహానటి సావిత్రి గారి తోను ..అంజలీదేవిగారితోను మంచి స్నేహం ఉండేది. తరచూ తనతో పాటు ఆమె నన్ను వారి ఇంటికి తీసుకుని వెళుతూ ఉండేది. అలా నన్ను చూసిన సావిత్రిగారు బాలనటిbగా పరిచయం చేయమని అమ్మను ఒత్తిడి చేశారు. బాలనటిగా నా నటనను చూసిన సావిత్రి గారు, నేను తప్పకుండా మంచి ఆర్టిస్టును అవుతానని అమ్మతో చెప్పారట.ఆమె అలా అనడం వల్లనే అమ్మ కూడా నన్ను నటన వైపుకు నడిపించడానికి ఉత్సా హాన్ని చూపించారు. నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. మా అమ్మ గారికి మంచితనం ఎక్కువ. చాలామంది సినిమా వాళ్లు మా ఇంట్లో అద్దెకి ఉన్నవాళ్లే.
వాళ్లు పెద్దగా రెంట్ ఇచ్చుకోలేరని తెలిసి కూడా పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఏది చేసినా ఆ వీధిలో ఉన్నవాళ్లదరికీ పంపించేవారు .. పంచేసే వారు. ఎవరైనా ఏదైనా బాగుంది అంటే ..
వెంటనే ఇచ్చేసేవారు. ఆమె మంచితనం వల్లనే ఆస్తి అంతా కూడా కరిగిపోయింది. ప్యాషన్ తో నటన వైపుకు వెళ్లిన నాకు, ఆ తరువాత నటన అవసరమైపోయింది" అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికి సీనియర్ నటి తులసిగారు తన నటనతో ప్రేక్షకులను మాయ లో పడేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: