టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నిత్యామీనన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ అయితే ఉంది. ఒకప్పుడు వరుస ఆఫర్ల తో బిజీగా ఉన్న నిత్యామీనన్ ప్రస్తుతం పరిమితం గా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

నిత్యామీనన్ రెమ్యునరేషన్ కంటే మంచి పాత్రల కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. నిత్యామీనన్ కు సోషల్ మీడియా లో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే బాలీవుడ్ ప్రముఖ సంస్థ దగ్గర నిత్యామీనన్ డేట్స్ ఉన్నాయని ఆ సంస్థ అనుమతులు లేకుండా నిత్యామీనన్ ఏ సినిమాకైనా డేట్స్ కేటాయించలేర ని తెలుస్తోంది. ఆ సంస్థను సంప్రదించడం సులువు కాదని సమాచారం అందుతోంది. ఈ తప్పే నిత్య కెరీర్ కు శాపంగా మారిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి, నిత్యామీనన్ వరుస సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిత్య అభిమానుల కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉందట.నిత్యామీనన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

గ్లామరస్ రోల్స్ కు ఓకే చెప్పి ఉంటే నిత్యామీనన్ కెరీర్ పరంగా మరింత ఎదిగి ఉండేవారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తెలుగుతో పోల్చి చూస్తే తమిళంలో నిత్యామీనన్ కు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. నిత్యామీనన్ ఒక్కో ప్రాజెక్ట్ కు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నిత్యామీనన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

సినిమాసినిమాకు నిత్యామీనన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగించిన వాళ్లలో నిత్యామీనన్ ఒకరు కావడం గమనార్హం. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు జోడీగా నిత్యమీనన్ నటించడం విశేషం. నిత్యామీనన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుంటే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందట..

మరింత సమాచారం తెలుసుకోండి: