టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా మోస్ట్ క్రేజీ సీనియర్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ ఆఖరిగా ఏప్ 3 మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ఎఫ్ 2 మూవీ కి సీక్వల్ గా తలకెక్కింది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ యువ దర్శకుడికి విక్టరీ వెంకటేష్ అవకాశం ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా బెల్లంకొండ గణేష్ హీరోగా వర్షా బోల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కిన స్వాతి ముత్యం అనే మూవీ కి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లక్ష్మణ్ కే కృష్ణ తాజాగా దర్శకత్వం వహించిన స్వాతి ముత్యం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇలా స్వాతి ముత్యం మూవీ తో ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్న యువ దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: