సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఛలో మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలవడంతో అతి తక్కువ కాలంలోనే రష్మిక మందన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. 

ప్రస్తుతం కూడా రష్మిక మందన వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం విడుదల అయినా సీతా రామం మూవీ లో రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం తో పాటు రష్మిక మందన పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తమిళ్ లో రూపొందుతున్న వరిసు అనే మూవీ లో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే వరస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా రష్మిక మందన తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: