
సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కూడా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ ఏ రోజు కూడా వారు వాటిని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. కేవలం తెర ముందు అలా ఉంటారు.. కానీ తెర వెనుక వాళ్ళు ఎంతో బాధను మోస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది నటీనటులు ఎన్నో బాధలు మోస్తూ స్వర్గస్తులైన విషయం కూడా తెలిసిందే. అయితే ఇదంతా పక్కన పెడితే ఒకప్పటి హీరో రాజేష్ కూడా ఇలాగే ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. అప్పటి హీరో రాజేష్ గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు . ఈయన కూతురు ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
ప్రస్తుతం ఆమె కోలీవుడ్లో మంచి గుర్తింపుతో కొనసాగుతోంది .ఇక రాజేష్ అక్క కూడా ఎవరో కాదు ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి. ఇక రాజేష్ దాదాపు 54 సినిమాలలో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనకు చిన్నవయసులోనే పెళ్లి కావడంతో అతి చిన్న వయసులోనే నలుగురు పిల్లలను కన్నాడు. ఈ విషయాలన్నీ తాజాగా శ్రీలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది . తన తమ్ముడు రాజేష్ తనను సినిమాలలో నటించవద్దని అన్నాడట.. కానీ బ్రతకడానికి మార్గం ఇదే కాబట్టి అందరం కలిసి చేసుకుంటే తప్పు ఉండదని చెప్పిందట శ్రీలక్ష్మి. జంధ్యాల సినిమాలలో కూడా రాజేష్ నటించాడని తెలిపింది.
హీరోగా స్టార్ పొజిషన్ లో వున్న సమయంలో తాగుడుకు బానిస అయ్యాడు. దాంతో అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు అని శ్రీలక్ష్మి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత రాజేష్ భార్య తన పిల్లలను ఎంతో కష్టంగా పెంచిందని, అయితే ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారని అది కూడా దాదాపు 20 సంవత్సరాల వయసులో చనిపోయారని తెలిపింది శ్రీలక్ష్మి. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోతే మరొక అబ్బాయి వినాయక చవితి ముందు బైక్ మీద స్పీడ్ గా వెళ్లి చనిపోయాడు అంటూ తెలిపింది. ప్రస్తుతం తన మేనకోడలు ఐశ్వర్య రాజేష్ ఎవరి సపోర్ట్ లేకుండా దూసుకుపోతుందంటూ చెప్పింది శ్రీలక్ష్మి. ప్రస్తుతం ఈ కామెంట్ లు కాస్త వైరల్ అవుతున్నాయి.