
నిన్నటికి నిన్న వరుణ్ ధావన్, కృతిసనన్ నటించిన తోడేలు సినిమా రిలీజ్ కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కరణ్ జోహార్ కార్యక్రమానికి హాజరైన వరుణ్ ధావన్ కూడా కృతి పేరు ఇప్పుడు నా దగ్గర లేదు.. వేరొకరి మనసులో ఉంది.. అతడు ఇప్పుడు ముంబైలో లేడు. దీపికా పదుకొనేతో సినిమా చేస్తున్నాడు అంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు . దీంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని మరింత స్పష్టమైంది. కానీ ఈ వార్తలపై కృతి సనన్ స్పందిస్తూ " వరుణ్ ధావన్ సరదాగా మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్పారు. కానీ అలాంటిదేమీ లేదు. కేవలం మేము స్నేహితులం మాత్రమే. దయచేసి తప్పుడు ప్రచారాలను చేయకండి" అంటూ క్లారిటీ ఇచ్చింది.
అయితే నిన్నటితో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నా.. నేటిజెన్లు మాత్రం ఇంకా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని , పెళ్ళి ప్రకటన కూడా చేస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కారణం ప్రభాస్ కి చెమట వచ్చినప్పుడు తుడుచుకోవడానికి తన చీర కొంగును ఇచ్చింది కదా దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అందుకే వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేస్తారు అంటూ ఆత్రుతగా నెటిజన్లు ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.