వాణిజ్య ప్రకటనలకు బుల్లితెరకు దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు వరుస పెట్టి షోలు చేస్తూ వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. మరోపక్క సినిమాలు చేస్తూ ఇంకొక పక్క రాజకీయాలలో కూడా బిజీగా ఉంటున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా ఆహా నిర్వాహకుల కోరిక మేరకు బాలయ్య మొదటిసారి సెలబ్రిటీ టాక్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.  బాలయ్య హోస్టింగు పై అందరికీ అనుమానాలు ఏర్పడిన నేపథ్యంలో తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య మొదటి సీజన్తో మంచి  సక్సెస్ పొందాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సీజన్ 2 కూడా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.


అయితే సీజన్ 2 లో పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నారు.  ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు నారా లోకేష్ తో పాటు మాజీ సీ.ఎమ్.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొని రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించి షోలో హీట్ పుట్టించారు. ఈ క్రమంలోని తదుపరి ఎవరు వస్తారు అనే విషయాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి తాజాగా ఈ ఎపిసోడ్ కి ప్రభాస్ తో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ హాజరైన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్ ని కూడా విడుదల చేయబోతోంది ఆహా బృందం.

తాజాగా ఈ షో కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ చేశారు.  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సెట్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ షో చివరి ఎపిసోడ్ కి ఆయన హాజరు కాబోతున్నారు అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాక కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో కలిసి వస్తున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: