మొదట మలయాళ సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది సంయుక్త మీనన్ . ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడిగా నటించి తన నటనతో అందరినీ మైమరిపించింది. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో వెంటనే కళ్యాణ్ రామ్ నటించిన బిబిసారా సినిమాలో కూడా మరొక అవకాశాన్ని దక్కించుకుంది సంయుక్తమీనన్. ఇక ఈ సినిమా కూడా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో వారు సాఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది ఈమె. ఈ నేపథ్యంలోనే ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా సార్లు కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. సార్ సినిమాలో సంయుక్త మీనన్ నటన ఎంత అత్యద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సార్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ హీరోయిన్ ని అందరూ లక్కీ హీరోయిన్గా పిలుస్తున్నారు. ఆమె తెలుగులో నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా హిట్లు అవడంతో స్టార్ హీరోలు సైతం ఈమె పేరును సిఫారసు చేస్తున్నారు .

స్టార్ హీరోలే ఈమె నటనను మెచ్చుకోవడంతో ఈమె క్రేజ్ ఇప్పుడు మరింత పెరిగిపోయింది.దాంతో రెమ్యూనిరేషన్ కూడా పెంచాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం సంయుక్త మీనన్ సితార బ్యానర్లో ఒక సినిమా చేస్తోందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక స్టార్ హీరో నటిస్తున్నారని ఇక ఆ సినిమా కోసం సంయుక్త మీనన్ భారీ రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంచెం క్రేజ్ వచ్చినా కూడా ఆ హీరోయిన్లు వారి రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ లిస్టులోకే చేరింది సంయుక్త మీనన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: