మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ సినిమా ధోని ఆల్టోల్డ్ స్టోరీ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన భరత్ అనే నేను మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించక పోయినప్పటికీ కియార కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ సి 15 అనే మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

రామ్ చరణ్ తో కలిసి పని చేయడం గురించి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ మూవీ లో పని చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఆయనతో పని చేయడం ఎల్లప్పుడూ చాలా బాగుంటుంది అని తెలిపింది. రామ్ చరణ్ ఒక అద్భుతమైన యాక్టర్ మరియు సూపర్ డాన్సర్ అని ప్రశంసల వర్షం కురిపించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ సక్సెస్ అయినప్పటికీ తాను మాత్రం అదే గ్రౌండ్ లెవెల్ లో ఉంటారు అని కియారా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: