టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రియ శరణ్.. హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా ఒక క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రీయ కు ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. ఈమె కెరియర్ మొదలుపెట్టి ఇప్పటికి 18 సంవత్సరాలు పైనే అవుతోంది. ఇప్పటికి అదే అందంతో ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని మెయింటైన్ చేస్తోంది.

శ్రీయ తెలుగు, తమిళ , హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా నటించింది. పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. రీసెంట్గా ఉపేంద్ర నటించిన పాన్ ఇండియా చిత్రం కబ్జాలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. తాజాగా శ్రీయకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతుంది. టాలీవుడ్లో ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధమయ్యిందని.. అది కూడా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే హీరోయిన్ శ్రియ క్రేజ్ మరింత పెరిగిపోతుందని చెప్పవచ్చు. సినీ ప్రేక్షకులు కూడా ఐటెం సాంగ్లకు ప్రత్యేకంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే దర్శక నిర్మాతలు కొంతమంది హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుంటూ స్పెషల్ సాంగ్లను చిత్రీకరిస్తూ ఉంటారు. శ్రియ rrr సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది.  ఈ సినిమా కూడా అద్భుత విజయాన్ని అందుకుంది. గతంలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచేసి అందాల విందు చేస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: