స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ విరూపాక్ష. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంకా సంయుక్త మీనన్ కలిసి నటించిన ఈ మూవీ ఏప్రిల్ 21న అనగా నిన్న విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇంకా అంతేకాకుండా.. సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచి మంచి సెన్సెషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. యాక్సిడెంట్ తర్వాత ఈ మూవీతో కంబ్యాక్ అయ్యాడు తేజ్. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీని పెంచేసిన మేకర్స్.. సినిమాతో ఆడియన్స్ అంచనాలను దాటేశారు. ప్రతి సీన్ కూడా సస్పెన్స్ థ్రిల్లింగ్‏ గురి చేసింది. ఇక మొదటి రోజు ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా బాగా అదిరిపోయాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా భారీగానే వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.


ఇక మార్నింగ్ ఫస్ట్ షో స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మాట్నీస్ నుంచి అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకి సూపర్ గా ఆదరణ పెరిగిపోయింది. సాయంత్రం దాకా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం కిక్కిరిసిపోయాయి. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం ఈ సినిమా 7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందట. ఇక ఈ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రూ. 22 కోట్లకు జరిగింది. మొదటివారంలో ఛాయా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.ఈ సినిమాలో సాయి తేజ్ సరసన సంయుక్త కథానాయికగా నటించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తెలుగు చిత్రపరిశ్రమలో ఫుల్ బిజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక ఈ బ్యూటీకి విరూపాక్ష మూవీతో మరో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్తకు అవకాశాలు రావడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: