మొదట గా హీరో గా కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమా లలో విలన్ పాత్రలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత మళ్లీ హీరో గా అవకాశాలను దక్కించుకొని అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా గోపీచంద్ ... మారుతీ దర్శకత్వంలో రాసి కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్క కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో రావు రమేష్ ... సత్య రాజ్ కీలక పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ "రామబాణం" అనే మూవీ లో హీరో గా నటించాడు. డింపుల్ హయాతి ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించగా ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ లో జగపతి బాబు ... కుష్బూ కీలక పాత్రలలో నటించారు.

 ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో ... వరుస టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పకచాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ ... నా పిల్లల్ని ఇప్పటికి కూడా నేను స్కూల్ కి బస్ లోనే పంపుతాను ... కారులో పంపను. అలాగే నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఎంత పడితే అంత ఇవ్వను ... వాళ్లకి కూడా రియాల్టీ అర్థం అవ్వాలి ... అందరితో కలవడం నేర్చుకోవాలి అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: