టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటించినది.. విలన్గా అరెస్టు అరవిందస్వామి నటించగా.. ప్రియమణి పొలిటికల్ పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు కామెడీ తరహాలో ఈ సినిమాని తెరకెక్కించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.


ముఖ్యంగా తమిళ దర్శకులు తెలుగు హీరోలకు సరైన సక్సెస్ లు ఇవ్వలేకపోతున్నారని వార్తలు ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నాగచైతన్య కస్టడీ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు కానీ అభిమానులను నిరాశపరిచే విధంగా ఈ సినిమా ఉండడంతో పలు రకాలుగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అక్కినేని హీరోలు సైతం పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఎందుకు ఫైట్లు వస్తున్నాయో తెలియదు స్లోగా వెళుతున్న సినిమా చూసి ప్రేక్షకులు కూడా విసుగు పుట్టేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారట. ఇలా వరుస ప్లాపులతో సతమతమవుతున్న మరొక హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు.


శర్వానంద్ చివరిగా సరైన సక్సెస్ అందుకోలేక దాదాపుగా ఎన్నో సంవత్సరాలు పైనే అవుతోంది. ఒకే ఒక జీవితం సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన ఫెయిల్యూర్ గానే మిగులుతున్నాయి. దీంతో ఎట్టకేలకు వివాహం చేసుకోవాలని ఫిక్సయిన శర్వానంద్ ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాల మీద కంటే ఎక్కువగా పెళ్లి విషయం పైన ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. టాలీవుడ్ లో ఇలా టైర్-2 హీరోల నుండి మెల్లగా ఈ ఇద్దరు హీరోలు దూరమవుతున్నారని వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి సరైన సక్సెస్ తో ఈ వార్తలకు చెక్ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: