టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారందరూ వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు.ఇక  ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో హీరోయిన్గా నటించిన రిచా గంగోపాధ్యాయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక అందరి లాగానే రీచా గంగోపాధ్యాయ సైతం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మిరపకాయ, మిర్చి ,నాగవల్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా ఎందరో స్టార్ హీరోల సినిమాలలో సైతం హీరోయిన్ గా నటించింది .ఇక ఈమె నటించింది తక్కువ సినిమాలో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. 

అనంతరం తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని విదేశాలలోనే సెటిల్ అయిపోయింది.  అయితే ఈమెకి ఒక బాబు కూడా ఉన్నాడు .అయితే తాజాగా రిచా గంగోపాధ్యాయ తన కొడుకుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. తాజాగా మాతృ దినోత్సవం సందర్భంగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది .అంతే కాదు ఆమె కొడుకు పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎలా ఉన్నాడో తెలియజేస్తూ తన కొడుకుకి సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

అంతే కాదు తన కొడుకుతో ఉండడం తనకు చాలా ఆనందంగా ఉంటుంది అంటూ తెలియజేసింది. తల్లిగా మారి 2 సంవత్సరాలు అవుతోంది.. కానీ జీవితంలో తల్లి కావడం చాలా గొప్ప అనుభూతి.. అంటూ ఆ పోస్టులో పేర్కొంది రీచా. అంతేకాదు తన కొడుకుతో తన భర్తతో ఊహించని దానికంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా పేర్కొంది. మదర్స్ డే సందర్భంగా రిచా షేర్ చేసిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి .ఇకపోతే ఢిల్లీకి చెందిన ఈమె విదేశాలలో చదువుకుంది అక్కడే ఉంటూ మిస్ ఇండియా పోటీల్లో సైతం పాల్గొని విజయం సాధించింది .ఈమె 2007లో మిస్ ఇండియా కిరీటం అందుకుంది రిచా. దాని అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: