
ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాదే శ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పాలి.ఈ రెండు సినిమాలలో నటించిన ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉండగా ఈ దర్శకులకు మాత్రం సినిమా అవకాశాలు అయితే రాలేదు. సాహో విడుదలైన కొన్ని సంవత్సరాల తర్వాత సుజిత్ కి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈయన ఈ సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఇకపోతే రాదే శ్యామ్ గత ఏడాది విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాధాకృష్ణకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు అయితే తాజాగా ఈయనతో సినిమా చేయడానికి ఒక హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.ఇటీవల ఒక స్టోరీతో రాధాకృష్ణ కోలీవుడ్ హీరో విశాల్ కి స్టోరీ లైన్ వినిపించారని తెలుస్తుంది..అయితే ఈ స్టోరీ లైన్ నచ్చినటువంటి ఈయన డైరెక్టర్ రాధాకృష్ణతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుంది.