కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రతిపాదన చేసింది. ఆర్థిక శాఖకు ముఖ్యమైన విన్నపాన్ని అందించింది. పెన్షన్ పెంచాలని రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెన్షన్ వెల్ఫేర్ గ్రీవెన్సెస్ కు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిన అంశాలను అమలు చేయాలని కూడా తెలిపింది. ఇక ఇదే జరిగితే చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ సీనియర్ సిటిజన్ ల పెన్షన్ కూడా పైపైకి చేరుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ముఖ్యంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పెన్షనర్ల గ్రీవెన్సెస్ కి సంబంధించి తన రిపోర్టులో కీలక సిఫార్సు చేసింది. గవర్నమెంట్ సీనియర్ సిటిజన్ ల కోసం పెన్షన్ పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఇకపోతే పెన్షన్ మొత్తాన్ని వయసుతోపాటు పెంచుకుంటూ వెళ్లాలని ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇక 65 సంవత్సరాలు వచ్చిన వారికి 5% పెన్షన్ పెంపు ఉంటుందట ఇక 70 ఏళ్ళు వచ్చిన వారికి 10 శాతం పెంపు అలాగే 75 సంవత్సరాలు వచ్చిన వారికి 15% అధిక పెన్షన్ లభిస్తుంది.

ఇక వీరితోపాటు 80 సంవత్సరాలు వచ్చిన వారికి 20% ఎక్కువ పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం ఈ సిఫార్సులకు అంగీకారం తెలుపుతుందా లేదా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా మెడిసిన్స్ ధరల పెంపు ద్రవ్యాలు బలం ఆరోగ్య సమస్యలు వంటి అంశాల కారణంగా సీనియర్ సిటిజనులపై ప్రతికూల ప్రభావం పడుతోందని అందుకే సామాజిక భద్రత లక్ష్యంగా ఈ ప్రతిపాదికలకు అంగీకారం తెలియజేయాలని కూడా కోరుతోంది. ఇక పెన్షన్ పెంపు నిర్ణయం కారణంగా ప్రభుత్వం ఆర్థిక భారం పడొచ్చని అయితే సీనియర్ సెంటిమెంట్లకు వెల్లడి చేస్తోంది. కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: