ఈ మధ్య కాలంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. తను తెరకెక్కిస్తున్న అప్ కమింగ్ మూవీపై వస్తున్న రకరకాల ఊహాగానాలు త్రివిక్రమ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. త్రివిక్రమ్ యంగ్ హీరో నితిన్ తో చేస్తున్న సినిమా ‘అ..ఆ’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో సమంత, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఇక తాజాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ పొల్లాచ్చి లో ఫిబ్రవరి 15 నుంచి జరుగుతుంది.  ఇప్పటి వరకూ ఈ మూవీ షెడ్యూల్స్ ని ఎప్పుడు పూర్తి చేసుకొని, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. కానీ తాజాగా అందరి అనుమానాలకు చెక్ చెబుతూ, త్రివిక్రమ్ ఫైనల్ షెడ్యూల్ వివరాలను, అలాగే రిలీజ్ డేట్ ని ఫైనలైజ్ చేశాడు. దీంతో త్రివిక్రమ్ మూవీపై వస్తున్న పలు అనుమానాలకు తెరపడినట్టు అయింది.


ఇక చిత్రం రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 22గా ఫిక్స్ అయింది.  ఇక మార్చి చివర్లో ‘అ..ఆ’ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ని వెతుక్కోవటం కష్టంగా మారిన త్రివిక్రమ్ కి ఎట్టకేలకు మిక్కీ జేయర్ దొరికాడు. అయితే ఈ ప్రాసెస్ లో దేవిశ్రీ ప్రసాద్ ని త్రివిక్రమ్ చాలా ప్రతయ్నం చేశాడు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ముందు పలు భారీ ప్రాజెక్ట్స్ ఉండటంతో, కచ్ఛితంగా కుదరదని చెప్పుకొచ్చాడు.


ఇక చేసేది లేక త్రివిక్రమ్ మిక్కీజే మేయర్ ని రంగంలోకి దింపాడు. ఈ విధంగా త్రివిక్రమ్ అన్నీ కష్టాలను దాటుకొని..రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. మొత్తంగా గాసిప్ రాయుళ్ళకి తన రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి, త్రివిక్రమ్ కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: