సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన మహేష్ 25వ చిత్రం మహర్షి. ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా రూ.150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ట్రైలర్కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్కు ముందే రికార్డుల దుమ్ము రేపుతోంది.
ఈ సినిమా ఓవర్సీస్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్లో మహేష్ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు తొలి రోజు అక్కడ ఏకంగా 2500 ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఓ తెలుగు సినిమా ఇంత భారీ ఎత్తున అక్కడ రిలీజ్ అవ్వడం ఇదే తొలి సారి. 2500 ప్రీమియర్ షోలు అంటే సినిమాకు టాక్ బాగుంటే తొలి రోజే అక్కడ మహర్షి వసూళ్ల దుమ్మ దులపడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మహర్షి భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోలోగా వస్తుండడంతో మహేష్బాబు కెరీర్లోనే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక్కడ కూడా మహర్షి పాత రికార్డులకు పాత రేయడం ఖాయమే అని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు - పీవీపీ - అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.