ఈ మద్య సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్
ప్లాన్ చేస్తున్నారు స్టార్ హీరోలు, దర్శక-నిర్మాతలు. అయితే కొన్ని సీక్వెల్స్ మంచి విజయాలు అందుకుంటే.. మరికొన్ని దారుణమైన ఫలితాలను పొందుతున్నాయి. తాజాగా తెలుగు,
తమిళ సినీ పరిశ్రమలో ‘పందెంకోడి ’ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మాస్
హీరో విశాల్.
కోలీవుడ్ లో ఏ
మూవీ చేసిన ఖచ్చితంగా తెలుగు లో డబ్ చేస్తున్నాడు విశాల్. ఈ నేపథ్యంలో ఆ మద్య డిటెక్టీవ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.
ప్రస్తుతం ‘యాక్షన్ ’మూవీతో తెలుగు,
తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో
విశాల్ సరసన
తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
విశాల్, మిస్కిన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `డిటెక్టివ్`. వరుస హత్యలకు సంబంధించి ఓ మిస్టరీని ఛేదించే ఈ డిటెక్టివ్ సహచరుడిగా
స్నేహ భర్త ప్రసన్న నటించాడు. విశాల్కు జంటగా అనూ ఇమ్మాన్యుయల్ నటించగా ఆండ్రియా నెగటివ్ రోల్లో నటించింది.
మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే ఈ
మూవీ చాలా సైలెంట్ గా హిట్ అయ్యింది. ఈ సస్పెన్స్
థ్రిల్లర్ తమిళనాట ఘనవిజయాన్ని సాధించి
విశాల్ కెరీర్లోనే తొలివారం వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది.
ఈ
మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ అయ్యింది.యూరప్లోని బ్రిస్టోల్లో సోమవారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. ఈ సినిమాలో
విశాల్ హీరోగా నటిస్తూనే సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, తొలి షెడ్యూల్ 40 రోజుల పాటు బ్రిస్టోల్లో జరుపుకోనున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. నిరవ్షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక
విశాల్ సరసన అశ్యా హీరోయిన్గా నటిస్తుంది.