మెగాస్టార్... విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఈ జోడి సక్సెస్ ఫుల్ జోడిగా పేరు తెచ్చుకుంది. డ్యాన్స్ లో, రొమాన్స్ సీన్స్ లో, ఇంకా చెప్పాలి కొన్ని సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో కూడా ఈ జోడి అదరగొట్టింది. ఈ జోడి అప్పట్లో క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. విజయశాంతి 13 ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మరోసారి తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా ప్రొఫెసర్ భానుమతిగా కనిపిస్తోంది.
ఈ సినిమా తరువాత విజయశాంతి నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏదైనా సినిమాలో నటిస్తుందో లేదంటే కేవలం పార్ట్ టైంగా మాత్రమే సినిమాలు చేస్తూ ఎప్పటిలాగే రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తుందో చూడాలి. మరోవైపు మెగాస్టార్ ఏడేళ్లు రాజకీయాల్లో ఉన్న తరువాత 150 తో తెరంగ్రేటం చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలానే ఇటీవలే వచ్చిన సైరా సినిమా కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.
ఇప్పుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గతనెలలోనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావొచ్చు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, జనవరి 5 వ తేదీన జరిగే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.
ఆ వేదికపై మెగాస్టార్, విజయశాంతి ఇద్దరు ఉంటారు. చాలాకాలం తరువాత ఇద్దరు వేదికను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు ఏం మాట్లాడబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరి నుంచి ఎలాంటి విషయాలు రాబోతున్నాయి. ఏం జరగబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, మెగాస్టార్ విజయశాంతి కలిసి ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.