మ్యాన్ వర్సెస్ వైల్డ్ .. ప్రఖ్యాత డిస్కవరీ ఛానల్ నిర్వహించే ఈ ప్రోగ్రామ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. చాలా మంది ప్రముఖులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. ఇది ఔట్ డోర్ ప్రోగ్రామ్. ప్రధానంగా అడవుల్లో జంతువుల మధ్య, క్రూర మృగాల మధ్య సెలబ్రెటీలు తిరిగితే ఎలా ఉంటుందనేది దీని కాన్సెప్ట్.

 

 

ఇటీవలే ప్రధాన మంత్రి మోడీ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్.. రిలీజ్ డేట్ వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎప్పుడో తెలిసిపోయింది. ఆయన పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ ప్రసార తేదీని డిస్కవరీ ఛానల్ ప్రకటించింది.

 

 

మార్చి 23న రాత్రి 8గంటలకు ఈ ప్రోగ్రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఛానల్ స్వయంగా ప్రకటించింది. ఎపిసోడ్ కు సంబంధించిన ఓ ప్రోమో వీడియోను కూడా విడుదల చేసింది. ఆ ప్రోమోలో సూపర్ స్టార్ క్వాడ్రి సైకిల్ మీద దూసుకొస్తూ కనిపిస్తారు. ఎపిసోడ్ ను కర్ణాటకలోని బందీపూర్ అడవుల్లో జనవరిలో చిత్రీకరించారు.

 

 

ఈ కార్యక్రమంతో తలైవా రజనీకాంత్ తొలిసారిగా ఓ టీవీ షోలో కనిపించనున్నారు. ఈ షూట్ లో తొలిరోజు రజనీకి గాయాలైనప్పటికీ కోలుకొని తర్వాత రోజే చిత్రీకరణలో పాల్గొన్నారట. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కనిపించిన ఎపిసోడ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించి రికార్డు సృష్టించినట్లు డిస్కవరీ ఛానల్ పేర్కొంది. మరి ఇప్పుడు రజినీకాంత్ షో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: