అనుష్క శెట్టి ఈ పేరు వినని వారు ఎవరు ఉండరు. ఇమే చేసిన క్యారెక్టర్లు.. ఇంకా ఏ హీరోయిన్ కూడా చేయలేదేమో కాబోలు. ఈమె సినీ ప్రయాణం సూపర్ నుంచి రుద్రమ దేవి దాకా.. అన్ని క్యారెక్టర్లు చేసేసింది. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే కథానాయిక ఈమె. మాములుగా ఈ భామ సినిమాలో నటించడం కాదు.. జీవిస్తుంది. బాహుబలితో ఈమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఈ భామ కెమెరా ముందుకొచ్చి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 

 

సరిగ్గా ఈరోజుకి అనుష్క ఇండస్ట్రీలో అగుడుపెట్టి 15 సంవత్సరాలు అయింది. ఈమె మొదటి సినిమా ‘సూపర్’ సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా  సక్సెస్ కాకపోయినా.. ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ గా మారింది. 


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలో అనుష్క శెట్టి 
నటించడంతో ఫుల్ ఫేమస్ అయింది. దీంతోపాటు ‘భాగమతి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో అనుష్క తమ అభిమానులను కవ్వించింది. ప్రస్తుతం ఈ భామ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే  సినిమా చేసింది. అయితే.. ఈ సినిమాలో అనుష్క చెవిటి, మూగ పాత్రను పోషించింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంజలి నటించింది. ఈ సినిమాను హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో షాలినీ పాండే, మాధవన్ ఇతరులు ముఖ్యపాత్రల్లో నటించారు.


అయితే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాగా., ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా పలు చిత్రాలు విడుదలకు వాయిదా పడ్డాయి. కాగా., ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్‌తో పాటు ఇంగ్లీష్‌ లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: