పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తీస్తే హిట్టు అనేలా క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ అనీల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా ఎఫ్-3కి డేట్ ఫిక్స్ చేశాడు. ఆగష్టు నుండి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందట. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో మరోసారి తన మ్యాజిక్ ఏంటో చూపిస్తా అంటున్నాడు అనీల్ రావిపూడి. మహేష్ తో తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ తో మనోడు స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరాడు. ఎఫ్-3 తర్వాత ఆ తర్వాత సినిమాకు ఇప్పటినుండే లైన్ చేసుకుంటున్నాడు అనీల్ రావిపూడి. అందుకే తన దగ్గర  బాలకృష్ణ,మోక్షజ్ఞలకు సరిపోయే మల్టీస్టారర్ కథ ఉందని.. రాస్తానని చెబుతున్నాడు. 

 

నందమూరి వారసుడి గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైం లో బాలయ్య, మోక్షజ్ఞ ఇద్దరికీ కథ రాస్తా అని చెప్పి బాలయ్యకు బిస్కెట్ వేస్తున్నాడు అనీల్. ఎందుకంటే కొడుకు డెబ్యూ విషయంలో కన్ ఫ్యూజన్ గా ఉన్న బాలకృష్ణకు అనీల్ తనకో ఛాన్స్ ఇవ్వండని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీశాడు తెలుసు కదా. 100వ సినిమా స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో వేరు వేరు దర్శకుల దగ్గర కథ విన్నాడు బాలయ్య బాబు. 

 

అందులో అనీల్ రావిపూడి రాసిన రామారావు కథ కూడా ఉంది. 100వ సినిమా ఛాన్స్ మిస్సయినా ఆ తర్వాత అనీల్ బాలకృష్ణ కలిసి పనిచేసే ఛాన్స్ రాలేదు. మరి ప్రస్తుతం బాలయ్య తన వారసుడికి ఇద్దరిని కలిపి సినిమా చేస్తా అన్న అనీల్ మాటలను సీరియస్ గా తీసుకుని అతనితో చర్చలు నడిపిస్తే బెటర్ అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2018 లోనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని అన్నారు కానీ ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: