మళయాళ దర్శకుడు స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌’ మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించడంతో ఈ మూవీని తెలుగులో సితార ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ రీమేక్ చేస్తోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ రీమేక్ లో ప్రధాన పాత్రకు బాలకృష్ణ పేరు వినిపిస్తుంటే ఈ సినిమా కథకు సంబంధించి మరొక హీరో పాత్ర అవసరం కావడంతో ఆ పాత్రలో జూనియర్ నటిస్తే బాగుండును అని తారక్ అభిమానులు ఆశ పడ్డారు. 


అయితే ఇప్పుడు వారి ఆశల పై నీళ్ళు జల్లుతూ ఇప్పుడు ఆ రెండవ హీరో పాత్రకు మంచు విష్ణు పేరు లేటెస్ట్ గా వెలుగులోకి రావడంతో జూనియర్ అభిమానులు షాక్ అవుతున్నారు. తాము ఈ మూవీలో బాలయ్య జూనియర్ లను కలిసి చూడాలి అనుకుంటే ఇప్పుడు తమ ఆశలకు భిన్నంగా మంచు విష్ణు ఎంట్రీ ఏమిటి అంటూ జూనియర్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. 


వాస్తవానికి అయ్యపన్ కోషియమ్ లో అయ్యప్పన్ క్యారెక్టర్ కు బాలయ్య ను కోషియమ్ క్యారెక్టర్ కు ఎంపిక చేయాలని ఆలోచనలు గట్టిగా నడుస్తున్నాయి. అయితే ఈ మూవీని బాలయ్య ఇప్పటి వరకు చూడలేదు అని తెలుస్తోంది. దీనికితోడు హీరోయిన్ లేకుండా గ్లామర్ లేకుండా పెద్దగా ఫైట్లు లేకుండా డ్రయ్ గ కేవలం ఎమోషన్ తో ఉండే ఈ క్యారెక్టర్ కు బాలయ్య ఎంతవరకు ఓకె అంటాడు  అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 


దీనికితోడు ఈ మూవీలను రెండవ హీరో పాత్రకు మంచు విష్ణుకు బదులుగా రానా ను తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ నడుస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషించడంతో అప్పటి నుండి రానా అంటే బాలయ్యకు చాల అభిమానం. దీనితో ఈ మూవీలోని రెండవ హీరో మంచు విష్ణు రానాల మధ్య టాస్ గా మారింది అని అంటున్నారు. అయితే జూనియర్ అభిమానులు మాత్రం జూనియర్ తో కుదరకపోతే కనీసం బాలయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి నటించాలి కానీ ఇలా బయట హీరో తో ఏమిటి అంటూ గగ్గోలు పెడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: