బీటౌన్ బ్యూటీ కియారా ఆద్వానీ బాలీవుడ్ లో మరో జాక్ పాట్ కొట్టేసిందా..? పాన్ వరల్డ్ మూవీలో లస్ట్ బ్యూటీ ఛాన్స్ దక్కిందా..? టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన కియారా గోల్డెన్ ఛాన్స్ తో బౌన్స్ బ్యాక్ కానుందా..? ఇంతకీ బాలీవుడ్ భామకు దక్కిన సర్ ప్రైజింగ్ ఛాన్స్ ఏంటో తెలుసా..?

 

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా అంటూ మహేశ్ బాబుతో పాటేసుకున్న కియారా.. భరత్ అనే నేనుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వెంటనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో నటించే అవకాశం వచ్చింది. వినయవిధేయ రామ బ్లాక్ బస్టర్ అయితే టాలీవుడ్ లో కియారా హవా ఉండేదే. కానీ సినిమా డిజాస్టర్ తో కియారాకు మరో ఛాన్స్ రాలేదు. ఇదే టైమ్ లో బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో కియారా బీటౌన్ లో బిజీ అయిపోయింది. 

 

కబీర్ సింగ్ తర్వాత కియారా అద్వానీ బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తోంది. గుడ్ న్యూస్, గుల్టీ లాంటి సినిమాతో బీటౌన్ ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఆరు క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. ఈ టైమ్ లో కియారాకు టాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తర్వాతి సినిమాలో డార్లింగ్ తో రొమాన్స్ చేయబోతున్నట్టు సమాచారం. 

 

ప్రభాస్, దర్శకుడు నాగ అశ్విన్ తో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కోసం కియారాను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఈ లాక్ డౌన్ సమయంలో స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి రావడంతో ఈ యంగ్ డైరెక్టర్ కాస్టింగ్ సెలక్షన్ పైనా దృష్టి సారించారట. అయితే ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరు.. అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ జాక్ పాట్ కొట్టేసిందని తెలుస్తోంది.  ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తాడని టాక్. ఇది పూర్తిగా ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ అని వినిపిస్తోంది. ఈ సినిమాలో కియారా ఫిక్స్ అయితే ఈ బ్యూటీ రేంజ్ మరింత పెరిగినట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: