ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ అందాల ఆరబోతకు అవకాశమివ్వని ఈ  ముద్దుగుమ్మ కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. సాయి పల్లవి చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ... అందరి హీరోయిన్ల కంటే ఒక ప్రత్యేక గుర్తింపు మాత్రం సాధించింది సాయి పల్లవి. ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో అదరగొడుతూ విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. 

 

 మొదటి సినిమా నుంచి తన ఓన్ వాయిస్ తోనే డబ్బింగ్ చెబుతూ వచ్చింది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి ప్రేమమ్  సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ... తెలుగు తెరకు మాత్రం ఫిదా సినిమాలో పరిచయమై అందరినీ మంత్రముగ్ధులను చేసిన విషయం తెలిసిందే. మామూలుగానే శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందుకే సాయి పల్లవితో శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో మ్యాజిక్ చేశాడు. తెలుగు రాని  హీరోయిన్ తో  తెలంగాణ యాసలో డైలాగులు చెప్పించి  ప్రేక్షకులందరినీ నిజంగానే ఫిదా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు.. 

 

ఫిదా  సినిమాతో సాయి పల్లవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో భానుమతి అనే పాత్రలో నటించిన సాయి పల్లవి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. కేవలం నటన పరంగానే కాదు స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో కూడా ఈ సినిమాలో అదరగొట్టింది.తాజాగా ఓ  ఇంటర్వ్యూలో ఫిదా  సినిమాకు సంబంధించి మాట్లాడిన సాయి పల్లవి డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫిదా సినిమాలో ఏ పిల్లగాడా అనే పాట అంటే ఎంత ఇష్టమని...  ఆ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్స్  తనకు ఎంతగానో నచ్చాయి అంటు  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: