పింక్ రీమేక్ తో మళ్ళీ సినిమాలు చేసేందుకు ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా క్రిష్ డైరక్షన్ లో చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ ముహూర్త కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. క్రిష్ ఇప్పటికే హిందీలో సినిమాలు తీసి ఉన్నాడు తెలుగులో అతని సినిమాలకు మంచి డిమాండ్ ఉంది అందుకే తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. 


ఈ మూవీని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం. రత్నం నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. అంతా మాములుగా ఉంటే ఈ సమయానికి వకీల్ సాబ్ రిలీజ్ అవ్వాల్సి ఉండేది కానీ కరోనా వల్ల అంతా లాక్ డౌన్ కావడంతో ఆ మూవీనే కానీ అన్ని సినిమాల రిలీజ్ లు ఆగాయి. పవన్ క్రిష్ మూవీ మరో బాహుబలి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. 


క్రిష్ తో మూవీ పూర్తి కాకుండానే ఆ తర్వాత హరీష్ శంకర్ తో సినిమా.. వీళ్ళతో పాటుగా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్. మొత్తానికి పవర్ స్టార్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు. కేవలం తెలుగులో సినిమాలు చేసి సౌత్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ బయోపిక్ తో కెరియర్ లో వెనుకపడ్డ క్రిష్ ఈ సినిమాతో ఎలాగైనా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: